Congressను గెలిపించుకుంటేనే PJRకు నిజమైన నివాళి: ఎంపీ Komati reddy
ABN , First Publish Date - 2022-06-23T21:24:21+05:30 IST
ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్ (PJR) అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Hyderabad: ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్ (PJR) అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. గురువారం పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి (Vijaya reddy) కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కొంత వీక్గా ఉన్న సమయంలో ఆయన కూతురు విజయారెడ్డి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంతోమంది పేదలకు పీజేఆర్ పట్టాలు ఇప్పించారన్నారు. ఆయన కుమార్తె విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ను గెలిపించుకుంటేనే పీజేఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. కాంగ్రెస్ డిమాండ్తో రైతు బంద్ ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. వరి కొని రెండు నెలలు దాటినా ఇంకా రైతులకు డబ్బులు రాలేదన్నారు. మెట్రో, ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ కృషితోనే వచ్చాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.