నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-01-29T02:39:10+05:30 IST
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని
మహబూబాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని బయ్యారంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న సాగర్ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్ చనిపోవటం చాలా బాధకరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది నీకు న్యాయమేనా కేసిఆర్ అని ఆయన ప్రశ్నించారు. నీకు కూడా బిడ్డలు ఉన్నారని, ఒక్కసారి అలోచించాలని ఆయన కోరారు. మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మంత్రి ఏమి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా నీ మధానం మార్చుకోవాలని కేసిఆర్ను ఆయన హెచ్చరించారు. సాగర్ కుటుంబానికే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అద్దంకి దయాకర్ రావు, తేజవత్ బెల్లయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.