అధిష్టానంపై కోపం లేదు: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-08-01T01:52:53+05:30 IST

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అధిష్టానంపై కోపం లేదు: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానంపై తనకెలాంటి కోపం లేదన్నారు. తనకు పీసీసీ రాలేదని కోపంలో కొన్ని మాటలు అన్నానని, వాటిని పట్టించుకోనవసరం లేదన్నారు. తామంతా కలిసే పనిచేస్తామన్నారు. మంత్రి మల్లారెడికి ఓ న్యాయం, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు ఇంకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ నుంచే దళిత బంధు ప్రారంభించడం వెనక మతలబేంటని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2021-08-01T01:52:53+05:30 IST