సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
ABN , First Publish Date - 2021-12-05T06:37:56+05:30 IST
సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
విస్సన్నపేట, డిసెంబరు 4: మండలంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని టీడీపీ మండల నాయకులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ని శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను ఆయనకు విన్నవించారు. నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి నెక్కళపు శ్రీనివాసరావు(డాబా శ్రీను), మట్టా వేణుగోపాల్, ఆకుల రాధాకృష్ణ, షేక్ అమానుల్లా, నాదెళ్ల నాగమణి, సత్యం, నల్లిబోయిన వెంకటేశ్వరరావు (చిన్నోడు), బెజవాడ నాని, వీరయ్య చౌదరి, రాంబాబు, సురేష్ పాల్గొన్నారు.