సీఎం జగన్ పాలనపై ఎంపీ కేశినేని నాని కామెంట్స్..
ABN , First Publish Date - 2022-02-09T04:00:06+05:30 IST
సీఎం జగన్ పాలనపై ఎంపీ కేశినేని నాని కామెంట్స్..
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఏపీలో అసమర్థ పాలన నడుస్తోందని ఎంపీ కేశినేని మండిపడ్డారు. ఏపీ రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, అప్పుల కోసం అమరావతి భూములను కూడా తాకట్టు పెట్టారని కేశినేని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోలవరంను పట్టించుకోవడం లేదని, ఏపీ ఆర్థిక క్రమశిక్షణ కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని కేశినేని నాని అన్నారు.