టీటీడీ డిక్లరేషన్‌ అంశాన్ని రాజ్యసభలో లేవనేత్తిన కనకమేడల

ABN , First Publish Date - 2020-09-20T16:14:21+05:30 IST

తిరుమలలో టీటీడీ డిక్లరేషన్‌ అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో లేవనేత్తారు.

టీటీడీ డిక్లరేషన్‌ అంశాన్ని రాజ్యసభలో లేవనేత్తిన కనకమేడల

న్యూఢిల్లీ: తిరుమలలో టీటీడీ డిక్లరేషన్‌ అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్  రాజ్యసభలో లేవనేత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శనానికి డిక్లరేషన్‌ అవసరం లేదనడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఒక వ్యక్తి కోసం డిక్లరేషన్‌ మార్చాలనుకోవడం హిందూ సంప్రదాయానికి వ్యతిరేకమన్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని కనకమేడల అన్నారు.


టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై పలు సంఘాలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున తప్పుబట్టారు. దీంతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ డిక్లరేషన్ వివాదంపై మరోసారి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..


‘‘సోనియా గాంధీ, వైఎస్ఆర్ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో డిక్లరేషన్‌పై సంతకం చెయ్యలేదు. ఈ నెల 23వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించే  సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్‌పై సంతకం చెయ్యరని చెప్పాను. హిందువేతరులు ఎవరైనా డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉంది. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరు డిక్లరేషన్‌పై సంతకం చెయ్యడం లేదు. గుర్తించిన భక్తుల నుంచి మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జగన్ గతంలో పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. దయచేసి నా మాటలను వక్రీకరించకండి’’ అని వైవీ సుబ్బారెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చుకున్నారు.

Updated Date - 2020-09-20T16:14:21+05:30 IST