ఎంపీ జీవీఎల్ ఇంట్లో హోలీ సంబరాలు

ABN , First Publish Date - 2022-03-18T16:51:28+05:30 IST

రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ఇంట్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఎంపీ జీవీఎల్ ఇంట్లో హోలీ సంబరాలు

విజయవాడ: రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ఇంట్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి హోలి సంబరాల్లో ఎంపీ పాల్గొన్నారు. నిన్న యూపీ...రేపు ఏపీ అనే నినాదంతో బీజేపీ శ్రేణులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. 


ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ... ఈ హోలి తమకు ప్రత్యేకమైనదన్నారు. ప్రధాని మోదీ పాలనపై దేశ వ్యాప్తంగా నమ్మకం పెరిగింది తెలిపారు. దక్షిణాదిలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు వాడవాడలా హోలీ జరుపుకుంటామని ఎంపీ అన్నారు. మా రోడ్ మ్యాప్ ఏపీలో అధికారంలోకి రావడమే అని స్పష్టం చేశారు. పవన్ రోడ్ మ్యాప్ తమ పార్టీ అధినేతలు చర్చిస్తారన్నారు. దక్షిణాదిలో గెలుపు దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ, జనసేన కలయికతో 2024లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామని.. వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పి కొడతామని ఎంపీ జీవీఎల్ అన్నారు. 

Updated Date - 2022-03-18T16:51:28+05:30 IST