ఏపీ దేవాలయాల ఆస్తులు బహిర్గతం చేయాలి: జీవీఎల్
ABN , First Publish Date - 2020-05-27T00:56:36+05:30 IST
ఏపీలోని అన్ని దేవాలయాల ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని బీజేపీ నేత జీవీఎల్ డిమాండ్ చేశారు. భక్తులు ఇచ్చిన ఆస్తులు, ఆభరణాలను..
అమరావతి: ఏపీలోని అన్ని దేవాలయాల ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని బీజేపీ నేత జీవీఎల్ డిమాండ్ చేశారు. భక్తులు ఇచ్చిన ఆస్తులు, ఆభరణాలను ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం లేకుండా ఆర్డినెన్స్ తేవాలని ఆయన అన్నారు. దానంగా స్వీకరించి వేలం వేయడం భక్తులను మోసం చేయడమేనన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను రివర్స్ చేసిన వైసీపీ ప్రభుత్వం...దేవాలయాల ఆస్తుల విషయంలో అలాగే వ్యవహరించాలని జీవీఎల్ సూచించారు.