శ్రీసిటీని సందర్శంచిన ఎంపీ గురుమూర్తి

ABN , First Publish Date - 2021-06-17T06:01:41+05:30 IST

: తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి తెలియజేయడంతో పాటు శ్రీసిటీలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు, శ్రీసిటీని కరోనా ఫ్రీ జోన్‌గా చేయడంలో ఎదురవుతున్న సవాళ్ళను గురించి వివరించారు.

శ్రీసిటీని సందర్శంచిన ఎంపీ గురుమూర్తి

సత్యవేడు, జూన్‌ 16: తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి తెలియజేయడంతో పాటు శ్రీసిటీలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు, శ్రీసిటీని కరోనా ఫ్రీ జోన్‌గా చేయడంలో ఎదురవుతున్న సవాళ్ళను గురించి వివరించారు. శ్రీసిటీలో మౌళిక వసతులు, వ్యాపారానుకూలత వాతావరణం ఎంతో బాగుందని ఎంపీ కితాబిచ్చారు. శ్రీసిటీ ప్రభావంతో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యాకలాపాలు బాగా పెరిగాయని ప్రశంశించారు. పలు అంతర్జాతీయ పరిశ్రమలకు వేదికగా, ఉపాధికి చిరునామాగా ఉన్న శ్రీసిటీ తన పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంపీ మొట్టమొదటి సారిగా శ్రీసిటీకి రావడం తాము గౌరవ ప్రదంగా భావిస్తున్నట్లు శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-06-17T06:01:41+05:30 IST