అందుకే ఉషాశ్రీ చరణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు: ఎంపీ గోరంట్ల

ABN , First Publish Date - 2022-04-19T19:53:04+05:30 IST

చదువు, సంధ్య లేని వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డిని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.

అందుకే ఉషాశ్రీ చరణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు: ఎంపీ గోరంట్ల

అనంతపురం: చదువు, సంధ్య లేని వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డిని, మంత్రి ఉషశ్రీకు మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి తెలియదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఉన్నత చదువులు చదివిన బీసీ మహిళ అని, ఆమె ఉన్నత చదువును, ఇంటిగ్రేటిని చూసే.. సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక చావు చచ్చిన పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు దిబ్బలోకి పడేశారని గోరంట్ల మాధవ్ అన్నారు.

Updated Date - 2022-04-19T19:53:04+05:30 IST