వలంటీర్‌ వ్యవస్థతో ప్రగతి

ABN , First Publish Date - 2022-05-25T05:55:40+05:30 IST

నడకుదురు (కరప), మే 24: గ్రామ,వార్డు వలంటీర్‌ వ్యవస్థతతో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని, దీనికి కారణమైన వాలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో ముఖ్యమంత్రి జగన్‌ గౌరవిస్తున్నారని కాకినాడ ఎంపీ వం గా గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబా

వలంటీర్‌ వ్యవస్థతో ప్రగతి

ఎంపీ గీత, ఎమ్మెల్యే కన్నబాబు

నడకుదురు (కరప), మే 24: గ్రామ,వార్డు వలంటీర్‌ వ్యవస్థతతో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని, దీనికి కారణమైన వాలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో ముఖ్యమంత్రి జగన్‌ గౌరవిస్తున్నారని కాకినాడ ఎంపీ వం గా గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. నడకుదురులోని ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం వలంటీర్ల సన్మా న కార్యక్రమానికి వారిద్దరూ హాజరై ప్రసంగించారు. సర్ప ంచ్‌ డేగల లలితకుమారి, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, చైల్డ్‌రైట్స్‌ ప్రొటెక్షన్‌ రాష్ట్ర సభ్యురాలు త్రిపర్ణ ఆదిలక్ష్మి, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కురసాల సత్యనారాయణ, జవ్వాది సతీష్‌, ఎంపీడీవో కర్రె స్వప్న, తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ ఈవోపీఆర్డీ త్రినాధరావు, నడకుదురు కార్యదర్శి పీఎ్‌సవీఆర్‌ బ్రహ్మానందం పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏకపక్ష విజయం సాధించి మూడేళ్లు పూర్తయిన ఎంపీ, ఎమ్మెల్యే పరస్పరం అభినందించుకున్నారు. 

Updated Date - 2022-05-25T05:55:40+05:30 IST