వికేంద్రీకరణ గురించి మాట్లాడడం విడ్డూరం

ABN , First Publish Date - 2020-08-09T10:07:14+05:30 IST

ఏడాది పైబడిన పాలనలో సున్నా అభివృద్ధి చేసిన వైసీపీ వికేంద్రీకృత అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ గల్లా జయదేవ్‌ ..

వికేంద్రీకరణ గురించి మాట్లాడడం విడ్డూరం

గుంటూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఏడాది పైబడిన పాలనలో సున్నా అభివృద్ధి చేసిన వైసీపీ వికేంద్రీకృత అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ గల్లా జయదేవ్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. నవ్యాంధ్యలో అఽధికారంలోకి వచ్చిన టీడీపీ అనేక సవాళ్లను ఎదుర్కొని రికార్డు స్థాయిలో సంక్షేమ కార్యక్రమలు చేపట్టిందన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ఇతర ప్రధాన నగరాలతో పోటీగా టీడీపీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో 72శాతం పూర్తచేశామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ పనితీరుకు అప్పట్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక ప్రశంసలు అందుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 14 నెలల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా వారు అవలంభించిన రివర్స్‌ విధానాలతో రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్నారు.  ఇదే కొనసాగిగే రాష్ట్రం కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని గల్లా తెలిపారు.

Updated Date - 2020-08-09T10:07:14+05:30 IST