3 రాజధానులకూ కేంద్రం నిధులిస్తుందా?: గల్లా
ABN , First Publish Date - 2020-08-08T08:52:10+05:30 IST
మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. 34 వేల ఎకరాలను 29 వేల
గుంటూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. 34 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు ముందుకొచ్చి ఇచ్చారు కాబట్టే అమరావతికి పీపుల్స్ క్యాపిటల్ అని పేరుపెట్టామని తెలిపారు. భారత చిత్రపటంలోనూ అమరావతిని నోటిఫై చేసి ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఎలా అని కేంద్రాన్ని నిలదీశారు. ‘ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి. ఆర్థికంగా కేంద్రం అండగా ఉంటుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.