పట్టాభి...నువ్వెవరో కూడా జనాలకు తెలీదు: MP Bharath

ABN , First Publish Date - 2021-10-20T14:10:51+05:30 IST

టీడీపీ నాయకులు మాట్లాడే తీరు సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని ఎంపీ మార్గాన్ని భరత్ అన్నారు. ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ నాయకుల చూస్తున్నారని ఆరోపించారు.

పట్టాభి...నువ్వెవరో కూడా జనాలకు తెలీదు: MP Bharath

అమరావతి: టీడీపీ నాయకులు మాట్లాడే తీరు సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని ఎంపీ మార్గాన్ని భరత్ అన్నారు. ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ నాయకుల చూస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ నాయకులే హిందూ దేవాలయాలపై దాడులు చేయించారన్నారు. పట్టాభిని మురికి కాలవలో తిరిగే పంది అని తాము కూడా మాట్లాడగలమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పట్టాభికి లేదని తెలిపారు. ‘‘నువ్వు ఎవరో కూడా అసలు జనాలకు తెలియదు...మీకు మీరే దాడి చేసుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామపైనే చంద్రబాబు చెప్పులు విసిరించిన ఘటన రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజం అనే సామెత చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని అన్నారు. 


గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ...రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక అల్లర్లు సృష్టించేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యాలు, మానభంగాలు టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని పట్టాభి వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పట్టాభి క్షమాపణ చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-20T14:10:51+05:30 IST