ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఎంపీ బండి
ABN , First Publish Date - 2022-01-21T02:23:29+05:30 IST
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం 12 గంటలకు పార్లమెంట్లోని ప్రివిలేజ్ కమిటీ ముందు బండి హాజరుకానున్నారు. ఇటీవల తన పట్ల కరీంనగర్లో పోలీసులు వ్యవహరించిన తీరును సంజయ్ వివరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవోపై కరీంనగర్లోని తన ఇంట్లో దీక్షకు బండి కూర్చున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆ దీక్షకను భగ్నం చేసి సంజయ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తన అరెస్ట్ సందర్భంగా పోలీసులు రూల్స్ను పాటించలేదని పేర్కొంటూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఫిర్యాదు చేశారు.