కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్‌

ABN , First Publish Date - 2022-04-21T23:32:10+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులపై కేటీఆర్‌ అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్‌

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులపై కేటీఆర్‌ అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. డ్రగ్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చేందుకు కేటీఆర్‌ రెడీగా ఉండాలని హెచ్చరించారు. తంబాకు టెస్ట్‌కు బీజేపీ నేత బండి సంజయ్‌ను తీసుకొచ్చే బాధ్యత తనదని ప్రకటించారు. 111 జీవోకు తూట్లు పొడిచి జన్వాడాలో కట్టిన ఫామ్‌హౌస్‌ను కూల్చేయాలన్నారు. బియ్యం బ్లాక్‌ మార్కెట్‌పై సీబీఐ విచారణ కోరే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. తనపై కవిత పోటీ చేస్తే మళ్లీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అర్వింద్‌ జోస్యం చెప్పారు.

Updated Date - 2022-04-21T23:32:10+05:30 IST