కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్

ABN , First Publish Date - 2022-05-15T01:05:40+05:30 IST

కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్

కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్

హైదరాబాద్: ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడానికే అమిత్‌షా వస్తున్నారని అన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్‌కు వివాదాస్పద భూములు ఎందుకిచ్చారని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. గిరిజన వర్సిటీకి భూములెందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎయిమ్స్‌ను ఇచ్చింది ఎవరో కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపాదనలు పంపే ఓపిక టీఆర్ఎస్‌కు లేదన్నారు. 

Read more