నేనేమైనా రౌడీ షీటర్‌నా: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2022-01-11T01:57:36+05:30 IST

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్

నేనేమైనా రౌడీ షీటర్‌నా: ఎంపీ అరవింద్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నేనేమైన రౌడీ షీటర్‌నా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు వారోత్సవాలలో రైతులు లేరన్నారు. మూడేళ్ళ క్రితం కేంద్రం చెప్తే మూడు గంటల్లో 317 జీఓ తెచ్చారన్నారు. 317 జీఓ కేసీఆర్‌కు కూడా అర్థం అయిందో లేదో కూడా తెలియదన్నారు. మీడియా ముందుకు రావడానికి కేసీఆర్ భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఏమన్నా అంటే అరెస్టులు వారెంట్లు అంటారన్నారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నేనేమైన రౌడీ షీటర్ నా అని ఆయన అన్నారు. దొంగ ఎఫ్ఐఆర్‌లతో కేసులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లు అతిగా ఉన్నాయని కోర్టులతో పోలీసు శాఖ చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. నువ్వు చేసిన ధౌర్భాగ్య పాలనకు తలదించుకుని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-11T01:57:36+05:30 IST