సహచర ఎంపీపై జాలి చూపరా?

ABN , First Publish Date - 2021-05-18T16:06:27+05:30 IST

‘‘ఎంపీ రఘురాఘకృష్ణరాజు..

సహచర ఎంపీపై జాలి చూపరా?

వైసీపీ పార్లమెంటు సభ్యులకు మర్రెడ్డి ప్రశ్న


అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంపీ రఘురాఘకృష్ణరాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ప్రజాస్వామ్యవాదులంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు మాత్రం... జగన్‌ ప్రభుత్వానికి, ఆ పార్టీకి లేని పవిత్రతను ఆపాదించడానికి నానా తంటాలు పడుతున్నారు’’ అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. సహచర ఎంపీకి ఏర్పడిన ప్రాణ హానిపై స్పందించకుండా వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, బాలశౌరి, శ్రీ కృష్ణదేవరాయలు ఇదంతా చంద్రబాబు స్ర్కిప్ట్‌ అనడం వారి బుద్ధిహీనతగా సోమవారం అభివర్ణించారు. తమ నాయకుడు పునీతుడిలా మారాలని రఘురామ భావించి, జగన్‌పై ఉన్న అవినీతి కేసులు త్వరగా తేల్చాలని కోర్టుకు వెళ్తే... దాని వల్ల చంద్రబాబుకు వచ్చే లాభనష్టాలేమిటో వైసీపీ ఎంపీలు చెప్పాలని నిలదీశారు. సహచర ఎంపీ అనే స్పృహ, జాలి లేకుండా మాట్లాడే వారికి భవిష్యత్‌లో రఘురామ పరిస్థితే వస్తే ఏం చేస్తారని మర్రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2021-05-18T16:06:27+05:30 IST