జనార్థన్ స్ఫూర్తితో ఉద్యమాలను బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-22T05:26:33+05:30 IST
: సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జలగం జనార్థన్(జన్ను) స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవి చలపతిరావు
సూర్యాపేటటౌన్ / గరిడేపల్లి రూరల్ / మోతె, మే 21 : సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జలగం జనార్థన్(జన్ను) స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవి చలపతిరావు అన్నారు. జనార్ధన్ ప్రథమ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞానకేంద్రంలో, గరిడేపల్లి, మోతె మండలాల్లో శనివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చలపతిరావు మాట్లాడుతూ ప్రజాసమస్యలు తెలుసుకొని, ప్రజల సమస్యల కోసం జీవితకాలం పోరాటం చేసిన గొప్ప జననేత జనార్థన్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్య క్షుడు కోటేశ్వర్రావు, భద్రయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్, గంట నాగయ్య, లక్ష్మయ్య, బొడ్డుశంకర్, కునుకుంట్ల సైదులు పాల్గొన్నారు. అదేవిధంగా గరిడేపల్లి మండలం వెలిదండలో జరిగిన జన్ను ప్రథమ వర్ధంతిలో సీపీఐ ఎంఎల్న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, ఆదూరి కోటయ్య, కామళ్ల నవీన్, అంజయ్య, శ్రీను, సుధాకర్, సైదులు పాల్గొన్నారు. మోతె మండలం రావిపహాడ్లో జరిగిన కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కోట మధుసూదన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.