చంద్రబాబు పర్యటనకు తరలిరండి

ABN , First Publish Date - 2022-05-20T06:26:17+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చేపట్టే జిల్లా పర్యటనకు మండలవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు భారీగా తరలిరావాలని టీడీపీ మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనకు తరలిరండి
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ మండల నాయకులు

 టీడీపీ నాయకులు

ధర్మవరంరూరల్‌, మే19:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చేపట్టే జిల్లా పర్యటనకు మండలవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు భారీగా తరలిరావాలని టీడీపీ మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఆ పార్టీ  స్థానిక కార్యాలయంలో గురువారం  ఏర్పాటుచేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడుతూ... గ్రామాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలు ధర్మవరం పట్టణంలోని మారుతిరాఘవేంద్రస్వామి కల్యాణ మండపం వద్దకు మధ్యాహ్నం ఒంటిగంటలోగా చేరుకోవాలన్నారు. అక్కడి నుంచి పెద్దఎత్తున కాన్వాయ్‌తో చెన్నేకొత్తపల్లికి వెళ్లి పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ సారథ్యంలో చంద్రబాబుకు నిర్వహించే ఘన స్వాగతం కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. చంద్రబాబు చేపట్టే బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో వస్తున్న విశేషస్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించేందుకు కుట్రపన్ను తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చిగిచెర్ల రాఘవరెడ్డి, తెలుగుయువత చిన్నూరువిజయ్‌చౌదరి, జంగం నరసింహులు, సీనియర్‌ కాశెప్ప, మల్లేనిపల్లి చంద్ర, అమర సుధాకర్‌ నాయుడు, గరుడంపల్లి అంజి, నేలకోట భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పుట్టపర్తిరూరల్‌/బుక్కపట్నం: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లాలో మొదటిసారి పర్యటనకు వస్తున్నారని, విజయవంతం చేయాలంటూ టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. నాయకులు విజయ్‌కుమార్‌, గూడూరు ఓబిలేసు, సామకోటి అది నారాయణ, దారపనేని చంద్రశేఖర్‌, బెస్తచలపతి, కొత్తపల్లి జయప్రకాష్‌, కోనంకి గంగాదర్‌నాయుడు,ఉమాపతియాదవ్‌, మురారి, శ్రీరాంనాయక్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. సోమందేపల్లి వద్ద తమ అధినేత బాదుడే బాదుడు కార్యక్రమ్నాన్ని నిర్వహిస్తున్నారని, నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

అమడగూరు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టే జిల్లా పర్యటనలో టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మండల కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి  కోరారు. మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. చంద్రబాబునాయుడు  శుక్రవారం సోమందేపల్లిలో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహిస్తారని విజయవంతం చేయాలని  కోరారు.


Updated Date - 2022-05-20T06:26:17+05:30 IST