వన్ సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంచ్ చేసిన మోటొరోలా

ABN , First Publish Date - 2020-07-11T00:03:55+05:30 IST

వన్ సిరీస్‌లో మోటొరోలా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది అక్టోబరులో భారత్‌లో విడుదల చేసిన

వన్ సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంచ్ చేసిన మోటొరోలా

న్యూఢిల్లీ: వన్ సిరీస్‌లో మోటొరోలా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది అక్టోబరులో భారత్‌లో విడుదల చేసిన ‘మోటో జి8 ప్లస్’కు రీబ్రాండెడ్ వెర్షన్‌లా ఉన్న ‘మోటొరోలా వన్ విజన్ ప్లస్’ను మధ్యప్రాచ్యంలో విడుదల చేసింది. ‘మోటొరోలా వన్ విజన్’కు సక్సెసర్‌గా దీనిని తీసుకొచ్చినప్పటికీ స్పెసిఫికేషన్లు, లుక్ పరంగా మోటో జి8ప్లస్‌ను పోలి ఉంది. అయితే, ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665, ట్రిపుల్ రియర్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 ఎంపీ ఫ్రంట్ షూటర్ వంటివి ఉన్నాయి. మోటొరోలా వన్ విజన్ ప్లస్ 4జీబీ/128 జీబీ స్టోరేజీ మోడల్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 14,300 ఉండే అవకాశం ఉంది.


 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్, 4జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512జీబీకి మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. 

Updated Date - 2020-07-11T00:03:55+05:30 IST