రోడ్డు ప్రమాదంలో మోటార్‌ సైక్లిస్టు మృతి

ABN , First Publish Date - 2021-05-17T06:31:39+05:30 IST

బుల్లెట్‌ మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహ నం ఢీ కొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో మోటార్‌ సైక్లిస్టు మృతి

ఏలూరు క్రైం, మే 16: బుల్లెట్‌ మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహ నం ఢీ కొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు చిరంజీవి బస్టాప్‌ ప్రాంతానికి చెందిన అక్షింతల శివ శంకర్‌ (40) సెంట్రింగ్‌ పనులు చేస్తూ ఉంటాడు. తూర్పులాకుల వద్ద ఆదివారం రాత్రి బుల్లెట్‌పై వెళ్తున్న శివను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందడంతో బోణం ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిశోర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. 


Updated Date - 2021-05-17T06:31:39+05:30 IST