మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2021-07-25T06:16:37+05:30 IST

తాడేపల్లిగూడెం పరిసర ప్రాం తాల్లో మోటారు సైకిళ్లు చోరీ చేసిన ముగ్గురు నిందితులను పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7 లక్షల విలువైన మోటా రు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

తాడేపల్లిగూడెం రూరల్‌ జూలై 24: తాడేపల్లిగూడెం పరిసర ప్రాం తాల్లో మోటారు సైకిళ్లు చోరీ చేసిన ముగ్గురు నిందితులను పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7 లక్షల విలువైన మోటా రు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనాథ్‌  శనివారం వివరాలను వెల్లడించారు.  గణపవరం మండలం కేశవరానికి చెందిన డి. బాలాజీ, చిన రామచంద్రాపు రానికి చెందిన జి. రాజేష్‌, పెంటపాడు మండలం మీనవల్లూరుకు చెందిన ఎం దుర్గారావు  తాడేపల్లిగూ డెం లక్ష్మీనారాయణ థియేటర్‌ ప్రాంతంలో శనివారం  సారా విక్రయిస్తుండగా సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, తడికలపూడి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి నట్టు నేరం అంగీకరించగా వారిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. సీఐ రఘు,  రవికుమార్‌, ఎస్‌ఐలు ప్రసాద్‌,  రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:16:37+05:30 IST