దండోరా వేసి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన Motkupalli
ABN , First Publish Date - 2021-07-23T19:11:46+05:30 IST
బీజేపీకి గుడ్బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: బీజేపీకి గుడ్బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దండోరా వేసి మరీ కేసీఆర్కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధు రాష్ట్రమంతా కేసీఆర్ అమలు చేస్తారన్న విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. దళితులకు ఆర్థిక, సామజిక భద్రతను కల్పించిన మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీకి సాయం చేద్దామని పోతే తననే బంధించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీలో దళితులు లేని సమయంలో కాషాయకండువా కప్పుకున్న దైర్యవంతుడినని...తన భవిష్యత్తుపై కాలమే సమాధానం చెబుతుందని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు.