18న టీఆర్ఎస్లోకి మోత్కుపల్లి
ABN , First Publish Date - 2021-10-16T21:45:15+05:30 IST
మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్: మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు, భువనగిరితోపాటు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగంలో ఇప్పటికీ మోత్కుపల్లి ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల నుంచి వివిధ పార్టీల్లో ఉన్న తన అనుచరులు, అభిమానులతో టీఆర్ఎ్సలో చేరేందుకు ఆయన ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. దళిత ఓటర్లపై సీఎం దృష్టి సారించడం, దళితబంధు వంటి ప్రతిష్ఠాత్మక పథకం తీసుకురావడం, ఉమ్మడి నల్లగొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి వారి ప్రకటనలకు ధీటుగా సమాధానం ఇవ్వడం తదితర అంశాల ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ నేత మోత్కుపల్లిని పార్టీలోకీ తీసుకునే అంశం లో సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. సీనియర్ నేతకు పార్టీలో ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తారో, దళితబంధు చైర్మన్ లేదా ఎమ్మెల్సీ పదవులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మోత్కుపల్లి చేరికకు సంబంధించిన అంశాన్ని మంత్రి జగదీష్రెడ్డి స్వయంగా సమన్వయం చేస్తున్నారు.