మ్యాచ్కు మునుపు సింధుతో తండ్రి అన్న మాటలివే!
ABN , First Publish Date - 2021-08-02T01:56:04+05:30 IST
మ్యాచ్కు మునుపు సింధుతో తండ్రి ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత షట్లర్ పీవీ సింధు అద్భుతం సాధించింది. చైనా క్రీడాకారిణిపై గెలిచి భారత్కు ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని అందించింది. 2016 నాటి రియో ఒలింపిక్స్తోపాటూ తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్లోనూ దేశానికి పతకం అందించిన సింధుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే..నిన్న జరిగిన మ్యాచ్లో సింధు ఓడిపోయి బంగారు పతకం గెలిచే అవకాశం చేజార్చుకున్న విషయం తెలిసిందే. తదుపరి మ్యాచ్లో కాంస్య పతకం సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో.. సింధూను ఆమె తండ్రి ఎంతగానో ప్రోత్సహించారుట. ‘‘ఆమెను మరింతగా మోటివేట్ చేశా.. నాకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నావనే ఫీలింగ్తో మ్యాచ్ ఆడమన్నా. అయితే..దేశ ప్రజల దీవెనలు సింధు వెంట ఉండటంతో..ఆమె పతకాన్ని గెలుచుకుంది. రెండు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకాన్ని తెచ్చిపెట్టిన తొలి క్రీడాకారణి సింధు అవడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది.’’ అని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు.