91 మంది ప్రముఖులకు మధర్‌ థెరిస్సా అవార్డులు

ABN , First Publish Date - 2021-02-25T07:21:52+05:30 IST

అచరిత్వ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 20 రంగాలలో కృషి చేసిన 91 మందికి మధర్‌ థెరిస్సా రాష్ట్రస్థాయి సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.

91 మంది ప్రముఖులకు మధర్‌ థెరిస్సా అవార్డులు
ఉపాధ్యాయుడు కృష్ణయ్యకు పురస్కారం అందించి సత్కరిస్తున్న నిర్వాహకులు

నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), ఫిబ్రవరి 24 : అచరిత్వ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 20 రంగాలలో కృషి చేసిన 91 మందికి మధర్‌ థెరిస్సా రాష్ట్రస్థాయి సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. నెల్లూరు పురమందిరంలో బుధవారం ఈ వేడుక జరిగింది. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీజీడీ కృపాల్‌ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాలలో పాతికేళ్లుగా వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శరణ్య అనే పేద విద్యార్థికి మెడిసన్‌ సీటు రావటంతో ఆ విద్యార్థికి రూ.50వేలు, గుండె జబ్బుతో బాధపడుతున్న యువకుడు జనాకు ఆరోగ్య ఖర్చుల కింద రూ.25వేలు సహాయం చేసినట్లు చెప్పారు. విశ్రాంత ఎస్పీ డాక్టర్‌ కాకుమాను రాజశోభామణి, ఐఆర్‌ఎస్‌ అధికారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ డాక్టర్‌ ఉషాకిరణ్‌, కోకుమాను రోజా,  మెయిళ్ల గౌరీ,  గంగాధర్‌ రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T07:21:52+05:30 IST