14 ఏళ్ల కుమార్తెకు ఒంట్లో నలతగా ఉండటంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని షాక్..

ABN , First Publish Date - 2021-09-04T17:15:47+05:30 IST

ఆమె ఓ రోజు కూలీ.. బిల్డింగ్ కాంట్రాక్టర్ల వద్ద కూలీ చేసుకుంటూ కూతురితో కలిసి జీవనం సాగిస్తుంటుంది..

14 ఏళ్ల కుమార్తెకు ఒంట్లో నలతగా ఉండటంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని షాక్..

ఆమె ఓ రోజు కూలీ.. బిల్డింగ్ కాంట్రాక్టర్ల వద్ద కూలీ చేసుకుంటూ కూతురితో కలిసి జీవనం సాగిస్తుంటుంది.. ఇటీవల 14 ఏళ్ల కూతురు ఒంట్లో నలతగా ఉందనడంతో ఆమెను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది.. ఆ బాలికకు అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్లు అసలు సంగతి బయటపెట్టారు.. ఆమె ఏడు నెలల గర్భవతి అని తేల్చారు.. తన కూతురు గర్భవతి అని తెలియడంతో ఆ మహిళ షాకైంది.. కూతురిని నిలదీస్తే అసలు విషయం బయటపడింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌లోని రౌలో ప్రాంతంలో నిర్మితమవుతున్న ఓ బిల్డింగ్ వద్ద పద్మా దేవి అనే మహిళ రోజు కూలీగా పనిచేస్తోంది. ఆ పక్కనే ఉండే బస్తీలో తన 14 ఏళ్ల కూతురితో కలిసి ఉంటోంది. తల్లితోపాటు కూతురు కూడా అప్పుడప్పుడు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వెళుతుండేది. ఇటీవల ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో కూతురిని తీసుకుని పద్మ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. ఆ బాలికకు అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్లు ఆమె ఏడు నెలల గర్భవతి అని తేల్చారు. షాకైన పద్మ కూతురిని నిలదీసింది. 


బిల్డింగ్ యజమాని కొడుకు యువరాజ్ గతంలో తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. దీంతో పద్మ చైల్డ్ హెల్ప్ లైన్‌ను ఆశ్రయించి యువరాజ్‌పై కేసు పెట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యువరాజ్‌ను విచారణకు పిలిచారు. ప్రస్తుతం యువరాజ్‌ను విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. 

Updated Date - 2021-09-04T17:15:47+05:30 IST