కూతురిని వాషింగ్ మెషిన్‌లో వేసి చంపేసిన తల్లి.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-20T08:23:07+05:30 IST

ఆమె మాతృత్వానికే మాయని మచ్చగా నిలిచింది. అభం శుభం తెలియని రెండు నెలల కూతురిని అతి కిరాతకంగా చంపేసింది. రెండు నెలల కూతురిని వాషింగ్ మెషిన్‌లో వేసి చంపేసింది. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని మైక్రోఓవెన్‌లో పడేసింది.. అనంతరం తనకేమీ తెలియనట్టు నాటకాలాడింది..

కూతురిని వాషింగ్ మెషిన్‌లో వేసి చంపేసిన తల్లి.. కారణమేంటో తెలిస్తే షాక్!

ఆమె మాతృత్వానికే మాయని మచ్చగా నిలిచింది. అభం శుభం తెలియని రెండు నెలల కూతురిని అతి కిరాతకంగా చంపేసింది. రెండు నెలల కూతురిని వాషింగ్ మెషిన్‌లో వేసి చంపేసింది. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని మైక్రోఓవెన్‌లో పడేసింది.. అనంతరం తనకేమీ తెలియనట్టు నాటకాలాడింది.. చివరకు పోలీసులకు దొరికిపోయింది.. విచారణలో షాకింగ్ విషయం చెప్పింది.. తనకు కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టిందని, అందుకే చంపేశానని చెప్పింది. 


ఢిల్లీకి చెందిన గుల్షన్‌ అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి రెండు నెలల పాప కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి ఇంటి రెండో అంతస్తులో ఉన్న ఓవెన్‌లో పాప ఉన్నట్టు గుర్తించారు. హాస్పిటల్‌కు తరలించే సమయానికే బాలిక మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తండ్రి, తాత, మామ రోజంతా దుకాణంలోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.


చిన్నారి తల్లి డింపుల్‌ను కూడా ప్రశ్నించారు. ఆమె సమాధానాలు అనుమానాలు కలిగడంతో సుదీర్ఘంగా విచారించారు. కొద్ది సేపటి తర్వాత డింపుల్ తన నేరాన్ని అంగీకరించింది. తనకు కొడుకు పుట్టాలని కోరుకున్నానని, కూతురు పుట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చంపేశానని పోలీసుల ఎదుట డింపుల్ అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డింపుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-04-20T08:23:07+05:30 IST