భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. అది ఎంత తప్పో అర్థం చేసుకునే లోపు తీవ్ర నష్టం.. చివరకు పోలీసులను ఆశ్రయించి..

ABN , First Publish Date - 2022-01-31T18:19:03+05:30 IST

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. సాఫీగా జీవనం సాగిపోతున్న దశలో ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది..

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. అది ఎంత తప్పో అర్థం చేసుకునే లోపు తీవ్ర నష్టం.. చివరకు పోలీసులను ఆశ్రయించి..

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. సాఫీగా జీవనం సాగిపోతున్న దశలో ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది.. భర్తను, పిల్లలను వదిలి అతడితో వెళ్లిపోయింది.. అతను తన శారీరక వాంఛను తీర్చుకుని ఆమెను వదిలేశాడు.. ఇంటికి తిరిగి వస్తే భర్త రానివ్వలేదు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. ప్రియుడిపై అత్యాచార కేసు పెట్టింది.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జబల్పూర్‌కు చెందిన బాధిత మహిళను మహ్మద్ షరీఫ్ అనే యువకుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ మహిళ తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి గతేడాది డిసెంబర్ 1వ తేదీన అతడితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది. అక్కడ ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి జీవించారు. ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. నెల రోజుల పాటు శారీరక వాంఛను తీర్చుకున్న షరీఫ్ ఆ తర్వాత ఆమెకు మొహం చాటేశాడు. తను మోసపోయానని తెలుసుకున్న భాదిత మహిళ జబల్పూర్‌లోని తన ఇంటికి ఈ నెల 28వ తేదీన తిరిగి వెళ్లింది. 


ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వలేదు. కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. దీంతో చేసేది లేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహ్మద్ షరీఫ్ అనే యువకుడు పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, దాదాపు నెల రోజుల పాటు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2022-01-31T18:19:03+05:30 IST