ఆమె నలుగురు పిల్లలకు తల్లి.. ఐదేళ్లుగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఆమెను అనుసరించి వెళ్లిన భర్త నడిరోడ్డుపై ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే..
ABN , First Publish Date - 2021-12-22T20:03:40+05:30 IST
ఆమెకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది.. నలుగురు పిల్లలకు తల్లి.. ఐదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆమెకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది.. నలుగురు పిల్లలకు తల్లి.. ఐదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అతడిని తరచుగా కలుస్తుండేది.. మంగళవారం సాయంత్రం కూడా అతడిని కలిసేందుకు వెళ్లింది.. ఆమెను రహస్యంగా అనుసరిస్తూ వెళ్లిన భర్త నడిరోడ్డు మీదే ఆమె ప్రియుడిని హతమర్చాడు.. రాజస్థాన్లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది.
కరణ్ సింగ్, వర్ష దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి జైపూర్లో నివసిస్తున్నారు. వర్షకు ఐదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ఢిల్లీకి చెందిన యోగేష్ కుమార్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనితో వర్ష వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీలైనపుడల్లా యోగేష్ ఢిల్లీ నుంచి జైపూర్ వచ్చి వర్షను కలుస్తుండేవాడు. కరణ్కు వర్ష వివాహేతర సంబంధం గురించి అనుమానం వచ్చింది. ఆమెను రహస్యంగా అనుసరిస్తుండేవాడు. మంగళవారం సాయంత్రం వర్ష, యోగేష్ జైపూర్లోనే కలుసుకోబోతున్నట్టు తెలుసుకున్నాడు.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు యోగేష్ను కలుసుకునేందుకు వర్ష ఇంటి నుంచి బయలుదేరింది. వర్షకు తెలియకుండా కరణ్ ఆమెను అనుసరించాడు. జైపూర్ రోడ్డు నెంబర్ 17లో యోగేష్ను వర్ష కలుసుకుంది. వారిద్దరినీ చూసి ఆగ్రహం చెందిన కరణ్.. వర్షను కొట్టడం మొదలుపెట్టాడు. యోగేష్ అడ్డుపడడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసి అతడి గొంతు కోసేశాడు. దీంతో యోగేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యోగేష్ను చంపేసిన అనంతరం కరణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరణ్ గురించి గాలిస్తున్నారు.