అనారోగ్యంతో ఉన్న భర్తను, ఐదేళ్ల కొడుకును వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. పోలీసులు పట్టుకుని అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని షాక్!

ABN , First Publish Date - 2021-12-31T15:41:03+05:30 IST

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు..

అనారోగ్యంతో ఉన్న భర్తను, ఐదేళ్ల కొడుకును వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. పోలీసులు పట్టుకుని అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని షాక్!

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. రెండేళ్ల క్రితం భర్త మానసిక అనారోగ్యానికి గురయ్యాడు.. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు.. కష్టకాలంలో భర్తకు అండగా ఉండాల్సిన ఆ మహిళ తన దారి తను చూసుకుంది.. భర్తను, కొడుకును వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.. పోలీసులు పిలిపించి అడిగితే షాకింగ్ సమాధానం చెప్పింది.. రాజస్థాన్‌లోని పాలిలో ఈ ఘటన జరిగింది. 


పాలికి సమీపంలోని రాతదియా గ్రామానికి చెందిన విజయ్ సింగ్, రుక్మాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల మనీష్ అనే కొడుకు ఉన్నాడు. రెండేళ్ల క్రితం విజయ్ తీవ్ర మానసిక రుగ్మతకు గురయ్యాడు. అప్పట్నుంచి చికిత్స కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. భర్త అనారోగ్యంతో కాపురం కష్టాల పాలు కావడంతో రుక్మా తన దారి తను చూసుకుంది. భర్తను, కొడుకును వదిలేసి ఈ నెల 25న తన ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో విజయ్ సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు రుక్మాను పట్టుకున్నారు. 


రుక్మాను, విజయ్ సింగ్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. రుక్మాకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే విజయ్‌తో కలిసి ఉండేందుకు రుక్మా అంగీకరించలేదు. తన భర్త పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, అతనితో కలిసి ఉండలేనని, ప్రేమికుడితోనే ఉంటానని రుక్మా తేల్చి చెప్పింది. పోనీ, ఐదేళ్ల కొడుకు బాధ్యత అయినా తీసుకోమని విజయ్ సింగ్ తండ్రి కోరారు. అందుకు కూడా రుక్మా నిరాకరించింది. కొడుకు బాధ్యత తీసుకునేంత స్థోమత తనకు, తన ప్రియుడికి లేదని చెప్పింది. దీంతో పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. 

Updated Date - 2021-12-31T15:41:03+05:30 IST