పోలీస్ స్టేషన్ ముందు అమాయకంగా కూర్చున్న ఈ మహిళ చేసిన నీచమిది.. భర్త కేసు పెట్టడంతో..

ABN , First Publish Date - 2022-04-27T17:10:54+05:30 IST

ఆ మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.. మూడున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. సదరు మహిళ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది.

పోలీస్ స్టేషన్ ముందు అమాయకంగా కూర్చున్న ఈ మహిళ చేసిన నీచమిది.. భర్త కేసు పెట్టడంతో..

ఆ మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.. మూడున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. సదరు మహిళ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది.. మూడున్నరేళ్ల కొడుకును తరచుగా కొడుతుండేది.. భర్త కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. సోమవారం సాయంత్రం అతను పనిలో నుంచి తిరిగి వచ్చేసరికి కొడుకు ఇంట్లో అచేతనంగా పడి ఉన్నాడు.. శరీరంపై గాయాలున్నాయి.. వెంటనే ఆ బాలుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 


మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన అనిల్ జాతవ్‌కు ఆరేళ్ల క్రితం గాయత్రీబాయి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడున్నరేళ్ల కొడుకు కన్హా ఉన్నాడు. అనిల్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గాయత్రీ బాయి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. తరచుగా కన్న కొడుకును కొడుతుండేది. సోమవారం సాయంత్రం అనిల్ ఇంటికి తిరిగి వచ్చేసరికి కన్హా గదిలోని కూలర్ ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బాలుడి శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ సమయంలో అతని భార్య గాయత్రి గది బయట నిలబడి ఉంది. 


అనిల్ జాతవ్ కొడుకును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. వెంటనే అనిల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. కొడుకును తన భార్య తీవ్రంగా కొట్టడంతో అతను మృతిచెందినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. నిందిత మహిళపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-04-27T17:10:54+05:30 IST