-
-
Home » Prathyekam » mother Killed three daughters and killed her self sgr spl-MRGS-Prathyekam
-
గాఢనిద్రలో భర్త.. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి భార్య చేసిన నిర్వాకమిది.. పొద్దున్నే ఊరంతా కలకలం..!
ABN , First Publish Date - 2022-05-08T16:32:41+05:30 IST
ఆ దంపతులకు నలుగురు పిల్లలు.. తమ ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి గురువారం రాత్రి ఆరుబయట నిద్రపోయారు..
ఆ దంపతులకు నలుగురు పిల్లలు.. తమ ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి గురువారం రాత్రి ఆరుబయట నిద్రపోయారు.. తెల్లవారుజామున 4 గంటలకు భార్య నిద్రలేచింది.. తన పక్కన పడుక్కున్న ఒక్కొక్క కూతురిని తీసుకెళ్లి సమీపంలోని బావిలో పడేసింది.. అలా ముగ్గురినీ పడేసిన తర్వాత కొడుకుని కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.. అయితే ఆ బాలుడికి తెలివి రావడంతో తల్లి నుంచి తప్పించుకుని తండ్రి దగ్గరకు వెళ్లి నిద్రపోయాడు.. దీంతో ఆ మహిళ కొడుకును వదిలేసి వెళ్లి బావిలో దూకేసింది.. ఉదయం లేచి చూసేసరికి నలుగురు చనిపోయి ఉన్నారు.
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా బైకు గ్రామానికి చెందిన జస్సీదేవి, కౌశలరామ్ దంపతులకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మద్యానికి బానిస అయిన కౌశల్ రామ్ రోజూ తాగి ఇంటికి వెళ్లి భార్యను కొడుతుండేవాడు. గురువారం రాత్రి కూడా కౌశల్ రామ్, జస్సీదేవి మధ్య గొడవ జరిగింది. అనంతరం అందరూ ఇంటి ఆవరణలో వేర్వేరు మంచాలపై నిద్రపోయారు. జస్సీ దేవి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు లేచింది. ముందుగా ఒక్కో కూతురిని తీసుకెళ్లి సమీపంలోని బావిలో పడేసింది. అనంతరం కొడుకును కూడా బావిలో వేసేందుకు ప్రయత్నించింది. అయితే కొడుకు నిద్ర లేచి తల్లికి అందకుండా పారిపోయాడు.
తల్లిని తోసేసి తండ్రి దగ్గరకు వెళ్లి నిద్రపోయాడు. దీంతో ఎవరైనా మేల్కొంటారని జస్సీదేవి భావించి తను వెళ్లి బావిలో దూకేసింది. ఉదయం లేచి చూసే సరికి నలుగరూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ కు తరలించారు. అల్లుడు రోజూ తాగి వచ్చి కొడుతుండడం వల్ల తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.