అందరూ పొలం పనులకు వెళ్లిన తర్వాత.. పిల్లలతో కలిసి ఆ తల్లి చేసిన పనికి కుటుంబసభ్యులు షాక్..

ABN , First Publish Date - 2021-12-02T22:11:01+05:30 IST

ఆ మహిళకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బతుకుదెరువు కోసం భర్త వేరే చోట ఉంటూ పని చేస్తున్నాడు. దీంతో ఆ భార్య పిల్లలతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే ఓ రోజు ఇంట్లోని వారందరూ

అందరూ పొలం పనులకు వెళ్లిన తర్వాత.. పిల్లలతో కలిసి ఆ తల్లి చేసిన పనికి కుటుంబసభ్యులు షాక్..

ఆ మహిళకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బతుకుదెరువు కోసం భర్త వేరే చోట ఉంటూ పని చేస్తున్నాడు. దీంతో ఆ భార్య పిల్లలతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే ఓ రోజు ఇంట్లోని వారందరూ పొలం పనులకు వెళ్లారు. అపుడు ఆ తల్లి పిల్లలతో కలిసి చేసిన పనికి కుటుంబసభ్యులు షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాకు చెందిన లచ్చారామ్‌కు ఆరేళ్ల క్రితం 25 ఏళ్ల చంపాదేవితో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కొడుకు కౌషల్, రెండేళ్ల పాప పుష్ప ఉన్నారు. లచ్చారామ్ పచ్‌పద్రలో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తుండగా.. భార్య పిల్లలతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం.. బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అత్తామామ ఉదయమే పొలం పనులకు వెళ్లారు. అపుడు చంపాదేవి అభం శుభం తెలియని ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత వారందరి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే చంపాదేవి చనిపోయింది. చికిత్స పొందుతూ కైలాష్ చనిపోగా.. మెరుగైన వైద్యం కోసం పుష్పను జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం పుష్ప మృతి చెందింది. ఈ ఘటన జరిగినపుడు లచ్చారాం పచ్‌పద్రలో ఉన్నాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లి పిల్లల్ని చంపి తాను చనిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామన్నారు.


Updated Date - 2021-12-02T22:11:01+05:30 IST