ఎంత పని చేశావు తల్లీ.. ముద్దులొలికే ఈ చిన్నారి బాబుకు విషమిచ్చి మరీ..

ABN , First Publish Date - 2022-05-21T00:06:55+05:30 IST

ఓ తల్లి దారుణానికి పాల్పడింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కొడుక్కు విషమించింది. ఆ తర్వాత తాను కూడా దాన్ని సేవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లీకొడుకులు ఇద్దరూ మృతి చెందగా

ఎంత పని చేశావు తల్లీ.. ముద్దులొలికే ఈ చిన్నారి బాబుకు విషమిచ్చి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: ఓ తల్లి దారుణానికి పాల్పడింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కొడుక్కు విషమించింది. ఆ తర్వాత తాను కూడా దాన్ని సేవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లీకొడుకులు ఇద్దరూ మృతి చెందగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జిగ్నేశ్‌భాయ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే చేతన్‌బెన్ అనే మహిళతో వివాహం జరిగింది. భార్యతో సహా సూరత్‌లో నివసిస్తున్న అతడు.. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ దంపతులు కుమారుడు అన్ష్‌కు జన్మనిచ్చారు. కాగా.. ఎప్పటిలాగే జిగ్నేశ్ ఉదయాన్నే నిద్ర లేచి డ్యూటీకి వెళ్లిపోయాడు. భర్త ఆఫీసుకు వెళ్లగానే.. ఏడాది వయసున్న కొడుకును తీసుకుని చేతన్‌బెన్ మార్కెట్ వెళ్తూన్నానంటూ ఇంట్లోంచి బయల్దేరింది. అలా ఇంట్లోంచి బయటికొచ్చిన ఆమె.. నేరుగా వెళ్లి విషయం కొనుగోలు చేసింది. తొలుత ఏడాది వయసున్న కొడుక్కు తాగించి.. తర్వాత ఆమె కూడా సేవించింది. 



ఈ క్రమంలో స్పృహతప్పి రోడ్డుపైనే పడిపోయింది. దీంతో స్థానికులు 108 అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా.. జిగ్నేశ్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడు పక్కింటి వారికి ఫోన్ చేశాడు. కొడుకును తీసుకుని ఆమె ఉదయాన్నే బయటికెళ్లి ఇంకా తిరిగి రాలేదని చెప్పడంతో.. అతడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అతడికి అసలు విషయం తెలిసింది. ఈ క్రమంలో జిగ్నేశ్.. ఆసుపత్రికి పరుగులు తీశాడు. అనంతరం అక్కడ డాక్టర్లు చెప్పింది విని షాకయ్యాడు. చికిత్స పొందుతూ తల్లికొడుకు ఇద్దరూ చనిపోయారని తెలియడంతో అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు. అయితే తన భార్య కొన్ని రోజులుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటుందనీ.. ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడినట్టు వాపోయాడు.


Updated Date - 2022-05-21T00:06:55+05:30 IST