కుమార్తెను హతమార్చి తల్లి బలవన్మరణం
ABN , First Publish Date - 2022-07-05T07:11:11+05:30 IST
నాలుగేళ్ల కుమార్తెను హతమార్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఈ విషాదం నెలకొంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన
మిర్యాలగూడ అర్బన్, జూలై 4: నాలుగేళ్ల కుమార్తెను హతమార్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఈ విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివ రాలిలా ఉన్నాయి. తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కందుల లింగయ్య, మల్లమ్మ కుమార్తె అయిన జ్యోతి(25)కి ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా మల్లాయిపాడు మండలం పుల్లెలపాడు గ్రామా నికి చెందిన గండ్రపూడి అశోక్తో 11ఏళ్ల క్రితం వివాహమైంది. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండగా, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో అశోక్ సోదరి భర్త అయిన గుంటూరు జిల్లా మాచర్ల మండలం సిరిగిరిపాడుకు చెందిన కాటమయ్య వరుసకు చెల్లెలైన జ్యోతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వీరిరువురు ఆరేళ్లక్రితం ఇంటినుంచి హైదరాబాద్కు పారిపోయి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అమ్ములు(4) అనే కుమార్తె జన్మిచింది. హైదరాబాద్లో జీవనం సాగిం చలేక రెండు నెలల క్రితమే హైదరాబాద్ నుంచి మిర్యా లగూడకు మకాం మార్చారు. వివాహేతర సంబంధంతో ఒక్కటైన ఇరువురి మధ్య కొద్దినెలలుగా విబేధాలు తలెత్తాయి. దీంతో కాటమయ్య మొదటి భార్యవద్దకు వెళ్లేందుకు సిద్ధపడగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి, నాలుగేళ్ల కుమార్తెను మిర్యాలగూడలోని సీతారాం పురం కాలనీలోగల అద్దె ఇంట్లో వదిలేసి వెళ్లాడు. అతనికోసం ఆరా తీయగా స్వగ్రామైన వెల్థుర్తిలో మొదటి భార్యవద్దకు చేరుకున్నట్లుగా జ్యోతికి సమాచారం వచ్చింది. అలాగే ఓ కేసులో నిందితుడిగా ఉన్న కాటమయ్యను వెల్ధుర్తి పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుసుకున్న జ్యోతి తన నాలుగేళ్ల కుమార్తెను హతమార్చి తాను సైతం ఉరివేసుకుంది. ఇంటి తలుపులు వేసి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలోంచి చూడగా తల్లీకుమార్తెలు విగతజీవులుగా ఉన్నారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తండి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిగిడాల సురేష్ తెలిపారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
ప్రభుత్వ కార్యాలయంలో బలవన్మరణం
మిర్యాలగూడ రూరల్: తాను పని చేస్తున్న కార్యాలయంలోనే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహ త్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఈదులగూడలో నివాసం ఉంటున్న నోముల సాయిబాబా(40) మండలంలోని అవంతీపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన 16 సంవత్సరాలుగా అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన సాయిబాబా అవంతీ పురంలోని కార్యాలయానికి చేరుకుని రాత్రి అక్కడే ఉండి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారి ఫ్యాన్కు వేలాడుతున్న సాయిబాబా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీ లించారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాయిబాబ జేబులో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసు ్తన్నట్లు ఎస్ఐ తెలిపారు. సాయిబాబాకు భార్య, కుమారులు భరత్, శరత్, కుమార్తె పూజ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న సాయిబాబా కుటుంబాన్ని ఆదుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంపత్ తెలిపారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.