ఎస్సార్బీసీలో తల్లి, కొడుకు మృతి

ABN , First Publish Date - 2021-05-13T05:57:13+05:30 IST

నందవరం గ్రామానికి చెందిన బోయతలారి సరస్వతి (33), ఆమె కుమారుడు మధుశంకర్‌ (12) ఎస్సార్బీసీలో ప్రమాదవశాత్తుపడి మృతి చెందారు.

ఎస్సార్బీసీలో తల్లి, కొడుకు మృతి
సరస్వతి, మధుశంకర్‌ (ఫైల్‌ ఫొటోలు)

బనగానపల్లె, మే 12: నందవరం గ్రామానికి చెందిన బోయతలారి సరస్వతి (33), ఆమె కుమారుడు మధుశంకర్‌ (12) ఎస్సార్బీసీలో ప్రమాదవశాత్తుపడి మృతి చెందారు. తల్లీకొడుకు మంగళవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లారు. అక్కడి నుంచి సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వ వద్దకు మంచి నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. దీంతో ఆ ఇద్దరు ఎస్సార్బీసీ కాల్వలో పడి గల్లంతైనట్లు బంధువులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నందివర్గం ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి మృతదేహాల కోసం కాల్వ వెంట వెతికించినట్లు తెలిపారు. రాళ్లకొత్తూరు గ్రామ సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వ వద్ద సరస్వతి మృతదేహం, పట్టణ శివార్లలోని కంకర ప్యాక్టరీ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో మధుశంకర్‌ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలకు బనగానపల్లె వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 



Updated Date - 2021-05-13T05:57:13+05:30 IST