షాకింగ్.. తల్లీకొడుకుల మృతదేహాల కింద ఓ గిన్నెలో వందలకొద్దీ రూ.500 నోట్లు.. పక్కనే గోడలపై..

ABN , First Publish Date - 2022-04-12T00:32:33+05:30 IST

ఇంట్లో తల్లీకొడుకుల మృతదేహాలు. ఆ మృతదేహాల కింద ఓ గిన్నెలో వందలకొద్దీ రూ.500నోట్లు ఉన్నాయి. పక్కనే ఉన్న గోడలపై కొన్ని రాతలు.. ఇవన్నీ స్థానికంగా కలకలం సృష్టించాయి. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఘటన బిహార్‌లో చోటు చేసు

షాకింగ్.. తల్లీకొడుకుల మృతదేహాల కింద ఓ గిన్నెలో వందలకొద్దీ రూ.500 నోట్లు.. పక్కనే గోడలపై..

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో తల్లీకొడుకుల మృతదేహాలు. ఆ మృతదేహాల కింద ఓ గిన్నెలో వందలకొద్దీ రూ.500నోట్లు ఉన్నాయి. పక్కనే ఉన్న గోడలపై కొన్ని రాతలు.. ఇవన్నీ స్థానికంగా కలకలం సృష్టించాయి. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


గయాలోని కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో తల్లీకొడులకులు ఇద్దరే నివసిస్తున్నారు. కాగా.. వారి ఇంటి తలుపులు సుమారు మూడు రోజులుగా మూసే ఉన్నాయి. ఈ క్రమంలో గది నుంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలైంది. దీంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. లోపల ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇంటి దగ్గరకు వెళ్లారు. కిటికీ నుంచి ఇంట్లోకి తొంగి చూశారు. అక్కడ కనిపించి దృశ్యం చూసి షాకయ్యారు. ఉరితాడుకు తల్లీ కొడుకు విగత జీవిగా వేలడటాన్ని చూసి విస్తుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.



ఈ నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు.. మృతదేహాలకు కింద గిన్నెలో వందల కొద్ది ఉన్న రూ.500 నోట్లను గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఇంట్లోని గోడలపై లాయర్, జడ్జిని ఉద్దేశించి రాసిన కొన్ని రాతలను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. గోడలపై ఆ రాతలు ఏంటి? వారి మరణానికి గల కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.




Updated Date - 2022-04-12T00:32:33+05:30 IST