నాలుగేళ్ల పాపతో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిందో బాలిక.. గదిలో కనిపించిన దృశ్యం చూసి భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి..

ABN , First Publish Date - 2022-05-08T16:04:37+05:30 IST

ఆ బాలిక త‌న ప‌క్కింట్లో ఉండే నాలుగేళ్ల పాప‌తో త‌ర‌చుగా ఆడుకునేది.. ఆ రోజు కూడా ఆ పాప‌తో ఆడుకుందామ‌ని వాళ్ల ఇంటికి వెళ్లింది.

నాలుగేళ్ల పాపతో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిందో బాలిక.. గదిలో కనిపించిన దృశ్యం చూసి భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి..

ఆ బాలిక త‌న ప‌క్కింట్లో ఉండే నాలుగేళ్ల పాప‌తో త‌ర‌చుగా ఆడుకునేది.. ఆ రోజు కూడా ఆ పాప‌తో ఆడుకుందామ‌ని వాళ్ల ఇంటికి వెళ్లింది.. అయితే ఆ ఇంట్లో క‌నిపించిన దృశ్యం చూసి షాకైంది.. ఎందుకంటే నాలుగేళ్ల‌ పాప, ఆ పాప త‌ల్లి విగ‌త జీవులుగా ప‌డి ఉన్నారు. ఆ బాలిక‌ వెంట‌నే ప‌రిగెత్తుకుంటూ వెళ్లి త‌మ ఇంట్లో వారికి విష‌యం చెప్పింది.. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  


హర్యానాలోని రేవారీ జిల్లాచెందిన దినేష్  6 సంవత్సరాల క్రితం సాక్షి అనే మ‌హిళ‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల అవ‌నిక అనే కూతురు ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా బవాల్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దినేష్ పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ప‌క్కింటి బాలిక చూసేట‌ప్ప‌టికి సాక్షి, అవ‌నిక వారి ఇంట్లో విగ‌త జీవులుగా ప‌డి ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు. 


అనంత‌రం మృత‌దేహాల‌ను బంధువుల‌కు అప్ప‌గించారు. భార్య‌ను, కూతురును దినేష్ చంపేసి ప‌రారై ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని దినేష్ కోసం అన్వేష‌ణ సాగిస్తున్నారు. 

Read more