డబ్బులు వేస్ట్ చేసిందని కుమార్తెను కొట్టిన తండ్రి... పరిగెత్తుకుంటూ వెళ్లి విషం తాగిన కుమార్తె.. వారిని గమనించిన తల్లి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-10-10T17:48:49+05:30 IST

కుటుంబంలో జరిగే చిన్నపాటి వివాదాలు...

డబ్బులు వేస్ట్ చేసిందని కుమార్తెను కొట్టిన తండ్రి... పరిగెత్తుకుంటూ వెళ్లి విషం తాగిన కుమార్తె.. వారిని గమనించిన తల్లి ఏం చేసిందంటే..

కుటుంబంలో జరిగే చిన్నపాటి వివాదాలు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. బీహార్‌లోని గయలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇంటిలో చెలరేగిన చిన్నపాటి వివాదం నేపధ్యంలో తల్లీకూతుళ్లు విషం మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా కుమార్తె మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు.


తల్లికి అంత్యక్రియలు చేస్తుండగా విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ ఉదంతం పరయియా గ్రామంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన శివదయాళ్ యాదవ్ తన కుమార్తె సోనీ కుమారికి కొంత సొమ్ము ఇచ్చి దాచమన్నాడు. అయితే అమె ఆ సొమ్ముతో ఏవో వస్తువులు కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెపై చేయిచేసుకున్నాడు. కుమార్తెను కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ ఘటనతో కలత చెందిన తల్లీకూతుళ్లిద్దరూ విషం తిన్నారు. తండ్రి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-10T17:48:49+05:30 IST