కరోనా రోగుల్లో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే...

ABN , First Publish Date - 2020-09-28T11:59:41+05:30 IST

కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల్లో 20 నుంచి 40 ఏళ్ల వయసు వారే అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.....

కరోనా రోగుల్లో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే...

కేరళ ఆరోగ్యశాఖ మంత్రి సంచలన నిజం వెల్లడి 

తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల్లో 20 నుంచి 40 ఏళ్ల వయసు వారే అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కరోనాతో మరణిస్తున్న వారిలో 72 శాతం మంది 60 ఏళ్ల వయసు పైబడిన వారేనని మంత్రి తెలిపారు. కేరళలో కరోనా సోకినా వారిలో 0.39 శాతం అంటే 656 మంది మరణించారని మంత్రి చెప్పారు. సెప్టెంబరు 26వతేదీ వరు 1,67,939 మందికి కరోనా సోకగా వారిలో 1,14, 530 మంది కోలుకున్నారని మంత్రి వివరించారు.ఒనం వేడుకల తర్వాత ఆంక్షలు ఎత్తివేయడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు.

Updated Date - 2020-09-28T11:59:41+05:30 IST