బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడికి జడ్ కేటగిరి భద్రత

ABN , First Publish Date - 2021-03-05T13:41:04+05:30 IST

బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ....

బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడికి జడ్ కేటగిరి భద్రత

న్యూఢిల్లీ : బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ ను కేంద్ర బీజేపీ పరిశీలకుడిగా బెంగాల్ రాష్ట్రానికి పంపిస్తున్న నేపథ్యంలో ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. బెంగాల్ ఎన్నికల్లో హింసాకాండ చెలరేగే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యానందరాయ్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు సీఆర్ పీఎఫ్ జవాన్లను రక్షణగా నియమించాలని నిర్ణయించారు.గతంలో బీజేపీ నేతలు జేపీ నడ్డా, కైలాష్ విజయవర్గీయల కాన్వాయ్ లపై దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే రజీబ్ బెనర్జీకి కూడా జడ్ కేటగిరి రక్షణ కల్పించారు.బీజేపీలో చేరిన మాజీ మంత్రికి వై కేటగిరి భద్రత కల్పించారు.బెంగాల్ పర్యటన సందర్భంగా కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ కు 10 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తామని కేంద్రం వివరించింది.

Updated Date - 2021-03-05T13:41:04+05:30 IST