కాణిపాకంలో మృత్యుంజయ హోమం

ABN , First Publish Date - 2020-03-29T11:16:40+05:30 IST

కాణిపాకంలో జరుగుతున్న శీతలాదేవి హోమం మహాపూర్ణాహుతితో శనివారం ముగిసంది.

కాణిపాకంలో మృత్యుంజయ హోమం

ఘనంగా మహాపూర్ణాహుతి


ఐరాల(కాణిపాకం), మార్చి 28: కాణిపాకంలో జరుగుతున్న శీతలాదేవి హోమం మహాపూర్ణాహుతితో శనివారం ముగిసంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విశ్వశ్రేయస్సు కోరి దేవదాయ శాఖ ఆదేశాల మేరకు గత ఐదు రోజులుగా ఈ హోమం నిర్వహించారు. శనివారం ఉదయం గణపతిపూజ, మండపారాధన, దీక్షహోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, శీతలాదేవికి అభిషేకం నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.  ఈవో దేముళ్లు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌, వేదపండితుడు సీహెచ్‌వీఎస్‌సుబ్బారావు, సోమశేఖర్‌ గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:16:40+05:30 IST