ఇక ఉదయం 5 నుంచే మెట్రో రైలు సేవలు
ABN , First Publish Date - 2021-12-20T17:42:00+05:30 IST
రాజధానిలో మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి సంచరిస్తున్న సంగతి విదితమే. అయితే.. శనివారం వరకు మెట్రో రైలు సేవలు గంట
బెంగళూరు: రాజధానిలో మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి సంచరిస్తున్న సంగతి విదితమే. అయితే.. శనివారం వరకు మెట్రో రైలు సేవలు గంట ముందుగా ప్రారంభం కానున్నాయని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నాగసంద్ర, సిల్కుబోర్డు, కింగేరి, బయ్యప్పనహళ్లి స్టేషన్ల నుంచి తొలి మెట్రో రైలు సంచారం ఉదయం 5 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్ల సంచారం ఉంటుంది. బెంగళూరు కెంపెగౌడ రైల్వేస్టేషన్ నుంచి మాత్రం చివరి రైలు సర్వీసు రాత్రి 11-30 గంటలకు ఉంటుంది. ఆదివారం మాత్రం మెట్రో రైలు సేవలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయని ఇందులో ఎలాంటి మార్పులేదని బీఎంఆర్సీఎల్ ప్రకటన పేర్కొంది.