రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-04-09T19:57:51+05:30 IST

నగరంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు..

రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు

హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు వెయ్యికిపైగా కేసులు నమోదు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలను సీజ్ చేస్తున్నారు. అనవసర కారణాలతో రోడ్డుపైకి వచ్చి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొక తప్పదని ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత అనసరంగా రోడ్లపైకి వచ్చినవారి వాహనాలను సీజ్ చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సుమారు వెయ్య వాహనాలపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్నారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.


Updated Date - 2020-04-09T19:57:51+05:30 IST