24 గంటల్లో 800కు పైగా కేసులు.. తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-05-26T01:11:45+05:30 IST

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు...

24 గంటల్లో 800కు పైగా కేసులు.. తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా 800కు పైగా కరోనా బాధితులను ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ మేరకు నేడు నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 805 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. 407 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసులు 17,082కు చేరాయి. 118 మంది మృత్యువాత పడ్డారు. 8,731 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 8,233 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-26T01:11:45+05:30 IST