తమిళనాడులో నేడు కూడా 4వేలకు పైగా కేసులు.. 60కి పైగా మరణాలు
ABN , First Publish Date - 2020-07-05T00:25:59+05:30 IST
తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ రోజు కూడా దాదాపు 4,300 కేసులు...
చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ రోజు కూడా దాదాపు 4,300 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ నేడు ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,280 కరోనా కేసులు నమోదయ్యాయి. 65 మంది మరణించారు. 2,214 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కి చేరింది. వీరిలో 44,956మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 60,592మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,450మంది ప్రాణాలు కోల్పోయారు.