తొలిరోజు 37 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్

ABN , First Publish Date - 2022-01-04T02:24:07+05:30 IST

దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ..

తొలిరోజు 37 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. తొలి రోజైన సోమవారంనాడు 37 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం, రాత్రి 7 గంటల వరకూ 37,84,212 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అర్హులైన టీనేజర్లు సుమారు 10 కోట్ల మంది వరకూ ఉన్నారు.


Updated Date - 2022-01-04T02:24:07+05:30 IST